హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేయనున్నారు. 4వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి శుక్రవారం 5వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని, 24 గంటల పాటు రిజర్వాయర్లలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వివరించారు. షేక్పేట, భోజగుట్ట రిజర్వాయర్ (లోప్రెసర్), జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్బీ, హైదర్నగర్, నల్గండ్ల, చందానగర్, హుడాకాలనీ, హఫీజ్పేట, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ రెండు రోజులు ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు కోరారు.