– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒకరోజు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కంపెనీ అయిన ఇండోసోల్ కంపెనీకి 17,630 ఎకరాల భూమిని కేటాయించడం పట్ల సిబిఐతో విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇండోసోల్ కంపెనీకి రామయపట్నం పోరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో దాదాపు 25 వేల ఎకరాల భూములను అప్పనంగా కట్టబెట్టారని విమర్శించారు. ఎన్నికల కోడ్ కాలంలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను బినామీ కంపెనీలకు ధారాదత్తం చేశారని విమర్శించారు. జగన్ అక్రమాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆశీస్సులు వున్నాయని అన్నారు.