ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అందిన ఫిర్యాదుల మేరకు జిల్లా ఎస్పీ జాషువాను బదిలీ చేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎస్పీగా ఉన్న రిశాంత్ రెడ్డి బదిలీ కావడంతో ఆస్థానంలో జాషువా జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను కూడా బదిలీ చేస్తున్నట్లు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.