మంత్రి రోజా సమక్షంలో వైసిపిలో చేరిక ప్రజాశక్తి – పుత్తూరు టౌన్: నిండ్ర మండలం నిండ్ర పంచాయతీకి చెందిన బాబురెడ్డి ఆధ్వర్యంలో కొప్పేడు, చవరంబాకం, ఇరుగువాయి గ్రామాలకు చెందిన 45 మంది డప్పు కళాకారుల కుటుంబాలు మంగళవారం రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీకి చెందిన అపరంజి, రామన్, కష్ణయ్య, అన్నమలై, రవి, దొరస్వామి, అరుణ్, వేలు, వసంతరాజు, ఎలుమలై, తంగదొరై, రాజేంద్రన్, విజయన్, రాజీవ్ గాంధీ, యుగంధర్, ఎలుమలై, రవీంద్రన్, శివలింగం, ఆర్.ఎలుమలై, రామయ్య, ఆర్.జయచంద్రన్, జి.కుప్పయ్య, పెరుమాళ్, వికే.రామస్వామి, మనీ, మురగయ్య, వి సుబ్రమణి, ఎలుమలై, అమాసై, బి సుబ్రమణ్యం, వేలయుధం, వేలు, వజ్రం, మోహన్, సి సుబ్రహ్మణ్యం, గజేంద్రలను మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.