ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : మండలంలో మొదటి ర్యాంకు, కోనసీమ జిల్లాలో 5వ ర్యాంకు సాధించిన పెదపట్నంలంక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని గిడుగు శ్రీరామ్దుర్గను, ఆమె తల్లితండ్రులను మండల కాపు ఉద్యోగ సంఘ నాయకులు ఆదివారం సన్మానించి అభినందించారు. మండల కాపు ఉద్యోగ సంఘ నాయకులు విద్యార్ధినికి ఐదు వేల రూపాయల నగదు అవార్డు తో సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమానికి మండల అధ్యక్షులు చిక్కంప్రసాద్, మాజీ అధ్యక్షులు కొమ్ముల రాఘవరావు , వలవల రాజా, కోనసీమ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నల్లా రామకృష్ణ ,దంగుడుబియ్యం శ్రీను, పైడిపర్తి చిన్ని నంద్యాల నాయుడు, తదితరులు పాల్గొన్నారు.