న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆప్ అధినేత బెయిల్పై బయటకు రావడం ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. కేజ్రీవాల్ బెయిల్పై బయటకొచ్చిన అనంతరం ఢిల్లీలో శనివారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం దక్షిణ ఢిల్లీలో జరిగిన రోడ్ షోలో కేజ్రీవాల్తోపాటు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో ఆరో దశ (మే 25)లో ఎన్నికలు జరగనున్నాయి.