ప్రజాశక్తి – పాలకొల్లు :వైసిపి ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో రద్దు చేసిన ఐదు లక్షల సామాజిక పింఛన్లను పునరుద్దరించే యోచనలో టిడిపి ప్రభుత్వం ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఎంపిడిఒ కార్యాలయంలో ఆదివారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యుత్ యూనిట్లు 300 దాటిందనో, వారి పిల్లలు ఐటి రిటర్న్స్ దాఖలు చేశారనే కారణాలతో వైసిపి ప్రభుత్వం పింఛన్లు రద్దు చేసిందని, వాటిని పునరుద్దరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. జగన్కు ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయడమే కాకుండా పింఛన్లు సైతం తొలగించారన్నారు. పింఛను సొమ్ము ఏకమొత్తంగా మూడు నెలలకోసారి ఇచ్చే ప్రతిపాదన సైతం ప్రభుత్వం వద్ద ఉందని వెల్లడించారు.
వైసిపి హయాంలో రద్దయిన పింఛన్ల పునరుద్దరించే యోచన – మంత్రి నిమ్మల రామానాయుడు
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/nimmala-1.jpg)