చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలో నిషేధిత సంస్థకు సంబంధించిన పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఎ) సోదాలు చేపట్టింది. హిజ్బ్-ఉత్-తహ్రీర్ (నఖు) అనే నిషేధిత సంస్థపై దర్యాప్తులో భాగంగా చెన్నై, తిరుచ్చి, పుదుకొట్టై, తంజావూరు, ఈరోడ్, తిరుప్పూర్తో సహా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. హెచ్యుటితో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి.. సాక్ష్యాలను సేకరించడానికి రాష్ట్ర పోలీసులతో పాటు ఎన్ఐఎ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. తదుపరి విచారణ కొనసాగుతోంది. హెచ్యుటి సభ్యులపై సమోటోగా కేసు నమోదైంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/nia.jpg)