పల్నాడు జిల్లా: నరసరావుపేట నియోజకవర్గంలో కొన్నేళ్లుగా స్థాన చలనం లేకుండా పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను రానున్న ఎన్నికల దృష్ట్యా బదిలీ చేయాలని జిల్లా అడిషనల్ ఎస్పీకి నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు శనివారం వినతి పత్రం అంద జేశారు. ఎన్నికల సమయంలో పోలీస్ శాఖలో ఉన్న ఉద్యోగులను బదిలీ చేయకుంటే వారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి రిగ్గింగ్ కు పాల్పడి అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సమయానికి ప్రభుత్వ అధికారులను బదిలీ చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. లా అండ్ ఆర్డర్ ను కాపాడాలన్నా, నియోజకవర్గంలో ఎన్ని కలు సజావుగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలన్నా స్థాన చలనం లేని పోలీసులను బదిలీ చేయాలన్నారు. ఈ విషయమై పోలీసు అధికారి చర్యలు తీసుకోకుంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అరవిందబాబు చెప్పారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గూడూరు శేఖర్,చింతిరాల బాలు,మొహమ్మద్ రఫీ, మాబు, శివప్రసాద్,చల్లగుండ్ల హరిక్రిష్ణ పాల్గొన్నారు.