తిరుమల : శ్రీవారి యాత్రిలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో జారీ చేసే బ్రేక్ దర్శనం టికెట్ల పొందిన యాత్రికుల సౌకర్యార్థం కొత్తగా ఎస్ఎంఎస్ పే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చింది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ను యాత్రికుల మొబైల్ నంబర్కు పంపిస్తారు. యాత్రికులు ఆ లింక్పైన క్లిక్ చేసి యూపీఐ, క్రెడిట్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శన టికెట్లను ప్రిట్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్లైన్లో సీఆర్వో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందుతున్న యాత్రికులకు విధానాన్ని అమలు చేస్తున్నారు.