ప్రజాశక్తి పర్చూరు
సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన కూరగాయలు, చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని తహసిల్దార్ కె సంధ్యశ్రీ అన్నారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద క్రిమిసంహారక మందులు వాడని కూరగాయల స్టాల్ను ఏర్పాటు చేశారు. రెవిన్యూ కార్యాలయ సిబ్బంది స్టాల్ను పరిశీలించారు. కూరగాయలను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో డిపి టీ నాగలక్ష్మి, ఏసు, శ్రీమన్నారాయణ, ఆర్ఐ ప్రేమ్కుమార్, ఎంప్టీ సిహెచ్ అప్పారావు, జి పద్మజ, శ్రీనివాసరావు, అంకారావు, లలితమ్మ, తదితరులు పాల్గొన్నారు.