ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: ముఖ్యమంత్రి కుప్పం పర్య టనలో భాగంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్పై దౌర్జన్యానికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చిత్తూరు ప్రెస్క్లబ్, ఏపీయూ డబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం ఏఎస్పీ ఆరిపుల్లకి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందిస్తూ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.
![ఆంధ్రజ్యోతి కెమెరామెన్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Untitled-1-copy-234.jpg)