ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్ఆర్టిసి ఇంజి నీరింగ్ విభాగంలో సేవలు అందించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు పి కృష్ణమోహన్ను ఆర్టిసి ఎమ్డి ద్వారకా తిరుమలరావు ఘనంగా సన్మానించారు. గురు వారం రిటైర్మెంటు కాబోతున్న కృష్ణమోహన్కు బుధవారం ఆర్టిసి హౌస్లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి అన్ని జిల్లాల ప్రజా రవాణా అధికారులు హాజరయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన కృష్ణమోహన్ కాకినాడ జెఎన్టియులో మెకానికల్ ఇంజినీరింగ్లో బిటెక్ పూర్తి చేశారు. 1988లో అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీరుగా ఎపిఎస్ఆర్టిసిలో తన ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు డిపోల్లో మేనేజరుగా, సిటిఎంగా, రీజనల్ మేనేజర్గా పనిచేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎమ్డి ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. కృష్ణమోహన్ ఆర్టిసికి 36 ఏళ్లపాటు అత్యున్నత సేవలు అందించారని తెలిపారు. ఏ స్థాయిలో పనిచేసినా పనిపట్ల నిబద్ధతతో సంస్థ పురోభివృద్ధికి కృషి చేసేవారని తెలిపారు. అలాగే రిటైర్మెంటు కాబోతున్న కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి ఆర్విఎస్ నాగేశ్వరరావునూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కెఎస్ బ్రహ్మానందరెడ్డి, కోటేశ్వరరావు, ఎఫ్ఎ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.