మిడ్‌క్యాప్‌ ఫండ్‌తో రూ.8,490 కోట్ల ఎయుఎం-మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడి

Mar 12,2024 21:30 #Business

ముంబయి : మోతీలాల్‌ ఓస్వాల్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ 10 ఏళ్లను పూర్తి చేసుకుందని తెలిపింది. తమ ఎఎంసి ఫండ్‌ దాదాపు రూ.8,490 కోట్ల ఎయుఎంను చేరిందని వెల్లడించింది. 2024 జనవరి 31 నాటికి 2,126 ప్రత్యేక పిన్‌ కోడ్‌లో 5.3 లక్షల మంది రిటైల్‌ పెట్టుబడిదారులు తమతో భాగస్వామ్యం అయ్యారని తెలిపింది. ఇందులో టాప్‌ రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్‌ కూడా ఒక్కటని పేర్కొంది. స్థిరమైన వృద్థిని సాధించామని మోతీలాల్‌ ఓస్వాల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అఖిల్‌ చతుర్వేది తెలిపారు. మిడ్‌క్యాప్‌ ఒక కేటగిరీగా 2004 నుండి మెరుగైన పనితీరును కనబరుస్తోందని ఫండ్‌ మేనేజర్‌ నికేత్‌ షా పేర్కొన్నారు.

➡️