వైసల్‌లో జిఎంఆర్‌కు 8.40 శాతం వాటాలు

Apr 30,2024 21:37 #Business

హైదరాబాద్‌ : విమానాశ్రయాలలో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అయినా వైసల్‌లో 8.40 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు జిఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వెల్లడించిం ది. ఈ విషయమై మంగళవారం రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఉత్తిష్ట విరాట్‌ ఫండ్‌ నుంచి 4,60,000 వైసల్‌ షేర్లను రూ.56.66 కోట్లకు కొనుగోలు చేయడానికి కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. జిఎంఆర్‌ గ్రూప్‌ ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్‌, గోవా, ఫిలిప్పీన్స్‌లోని విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.

➡️