హైదరాబాద్ : ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎసి, రిఫ్రిజిరేటర్లు, రూమ్ కూలర్లపై పలు ఆఫర్లను అందిస్తున్నట్లు టాటా గ్రూపులో భాగమైన క్రోమా తెలిపింది. వేసవి క్యాంపెయిన్ 2024తో మ్యాజిక్ పేరుతో పలు ఉత్పత్తులపై రాయితీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇన్వెర్టర్ స్ప్లిట్ ఎసిల ధరలు రూ.24,990 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఏదైనా కొత్త ఏసి కొనుగోలుపై గరిష్టంగా రూ6,500 వరకు ఎక్సేంజీ ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంది.