ధర రూ.98 లక్షలు
న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి భారత మార్కెట్లోకి మంగళవారం ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ను విడుదల చేసింది. ఎక్స్షోరూం వద్ద దీని ధరను రూ.97.84 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త ఎడిషన్ వాహనాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆడి ఇండియా తెలిపింది. 3.0 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్తో దీన్ని రూపొందించగా.. కేవలం 5.6 సెకన్లలోనే గంటకు 0ా100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోనుందని పేర్కొంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/4-58.jpg)