నేపాల్ : భారత్కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్, ఎండిహెచ్ లను నేపాల ప్రభుత్వం బ్యాన్ చేసింది. వీటిలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఇటీవల సింగపూర్, హాంకాంగ్లలో ఎండిహెచ్-ఎవరెస్ట్ మసాలాలను బ్యాన్ చేశారు. ఇప్పుడు తాజాగా … ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కఅష్ణ మహారాజన్ ప్రకటించారు.