బెంగళూరు : ఫ్లిప్కార్ట్కు చెందిన క్లియర్ ట్రిప్ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. ఈ భాగస్వామ్యం క్లియర్ట్రిప్కి ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుందని పేర్కొంది. సౌకర్యవంతమైన, ఆందోళన రహిత ప్రయాణ అనుభవాలను అందించడానికి ప్రయాణికులను ప్రోత్సహించడం ఈ బ్రాండింగ్ లక్ష్యమని క్లియర్ట్రిప్ సిఇఒ, అయ్యప్పన్ ఆర్ పేర్కొన్నారు.