హైదరాబాద్ : సైన్స్ ఆధారిత ఎఫ్ఎంసిజి కంపెనీ జైడస్ వెల్నెస్ కొత్తగా ‘గ్లూకాన్-డి’ పేరుతో ఎలక్ట్రోలైట్ ఎనర్జీ రెడీ టుడ్రింక్ (ఆర్టిడి) పానియాన్ని ఆవిష్కరించింది. వినియోగదారుల వేగవంతమైన జీవనశైలి ప్రయాణాల వల్ల రెడీ టూ డ్రింక్ పానీలయాలకు డిమాండ్ పెరుగుతోందని పేర్కొంది. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.1200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. గ్లూకాన్-డిలో సోడియం, పొటాషియం క్లోరైడ్, విటమిన్లు సి, బి3, బి5, బి6తో తయారు చేసినట్లు జైడస్ వెల్నెస్ సిఇఒ తరుణ్ అరోరా పేర్కొన్నారు. 200 గ్రాముల టెట్రా ప్యాక్ ధరను రూ.45గా నిర్ణయించామన్నారు.