న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. స్విఫ్ట్, గ్రాండ్ విటారా ఎంపిక చేసిన వేరియంట్ల ధరల పెంపు తక్షణమే అమల్లోకి వచ్చిందని బుధవారం వెల్లడించింది. స్విఫ్ట్ ధరను ఏకంగా రూ.25వేలు పెంచేసింది. గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్ ధరను రూ.19వేలు పెంచింది.