అహ్మాదాబాద్ : అజూనీ బయోటెక్ లిమిటెడ్ రైట్ ఇష్యూ మంగళవారం ప్రారంభమైంది. దీని ద్వారా రూ.43.81 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా మే 31న ఈ ఇష్యూ ముగియనుంది. ఈ నిధులను భూసేకరణ, సైట్ డెవలప్మెంట్, సివిల్ వర్క్, ప్లాంట్, మిషనరీ లాంటివి సేకరించడంతో పాటు వర్కింగ్ కేపిటల్ అవసరాలు, కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నట్లు తెలిపింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/9-25.jpg)