ప్రజాశక్తి -గోకవరం తమ సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి అంగన్వాడీలు బుధవారం నిరసన తెలిపారు. కోరుకొండ ఐసిడిఎస్ యూనియన్ అధ్యక్షురాలు ఎం.మాలతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ ఎం.వెంకటలక్ష్మి, కె.సుబ్బలక్ష్మి, ఎంవి.వరలక్ష్మి, టి.శ్రీదేవి, కెఎల్.కుమారి పాల్గొన్నారు.
![అంగన్వాడీల వినతి](https://prajasakti.com/wp-content/uploads/2023/12/Untitled-1-copy-55.jpg)