‘ఉక్కు’ పనుల్లో కదలికేది?

2017లో ప్రతిపక్ష నాయకుని హోదాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ శంకుస్థాపనకు పరిమితమైంది. దీంతోపాటు చెన్నూరులో సుగర్‌ పరిశ్రమ పునరుద్ధరణ, కడపలో స్ట్రోమ్‌వాటర్‌ డ్రెయిన్లు, రాజోలు, జొలదరాశి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీలు అమలుకు ఆమడదూరంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో అన్నమయ్య రిజర్వాయర్‌ పునరుద్ధరణ, జిఎన్‌ఎన్‌ఎస్‌ ఫేజ్‌-2 పనుల పునరుద్ధరణ, కొప్పర్తి పైప్‌లైన్‌, హజ్‌హౌస్‌ పెండింగ్‌ పనులు, ఒంటిమిట్ట చెరువులో జాంబవంతుని విగ్రహం ఏర్పాటు వంటి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాబోయే రెండు నెలల్లో ముఖ్యమంత్రి టర్మ్‌ ముగియనున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన నేథ్యంలో కథనం… ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లా ప్రగతి నత్తనడకన సాగుతోంది. కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమలు, గోపవరంలో సెంచురీఫ్లైవుడ్‌ పరిశ్రమలు, జిజిహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ మినహా మిగిలిన హామీలు అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా చెన్నూరు సుగర్‌ పరిశ్రమ పునరుద్ధరణ, జెఎస్‌డబ్య్లూ కంపెనీ ఉక్కు పరిశ్రమ, జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2 పనుల్లో ఆశించిన రీతిలో కదలిక కని పించడం లేదు. చెన్నూరు సుగర్స్‌ కంపెనీ పునరుద్ధరణ సర్వే దశలోనే మునకలేస్తోంది. పునరుద్ధరణ పనులకు రూ.60 కోట్లను విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. 2007లో కీ.శే, మాజీ ముఖ్యమంత్రి అప్పటి వైఎస్‌ సర్కారు తల పట్టిన రూ.72 కోట్లతో కడపలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ కోల్డ్‌స్టోరేజీకి పరిమితమైంది. ఫలితంగా వర్షా కాలంలో కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటిలో మునకలు వేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.అడ్డంకుల్లోనే ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ రూ.345 కోట్లతో కూడిన ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ పనులకు మోక్షం లభించలేదు. ఐదేళ్లుగా స్థలం ఎంపిక, శంకుస్థాపన దశలోనే మగు ్గతోంది. ఫలితంగా యూనివర్శిటీ భవన నిర్మాణం ఎప్పటికి సాకా రమవుతుందో తెలియని దుస్థితి దాపురించింది. దీనికితోడు రూ.12 కోట్ల తో కూడిన హజ్‌హౌస్‌ పెండింగ్‌ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. నిధుల లేమి కారణంగా సకాలంలో పూర్తి చేయడంపై సందేహం నెలకొంది.కొప్పర్తి పైప్‌లైన్‌ మోక్షమెప్పుడో?రూ.150 కోట్ల విలువ కలిగిన కొప్పర్తి పారిశ్రామికవాడ నీటి సర ఫరా పైప్‌లైన్‌ సాకారానికి నోచుకోవడం లేదు. నీటి కొరత, పర్యావరణ అను మతుల కారణంగా పారిశ్రామిక పురోగతి కొరవడింది. ఇటీవల కొప్పర్తిలోని వైఎస్‌ఆర్‌ క్లస్టర్లలో ఏర్పాటు చేసిన పరిశ్రమలకు నీటి సదు పాయం అందడం లేదు. ఫలితంగా ఎప్పటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తాయో తెలి యడం లేదు. కడప, ప్రొద్దుటూరు పాల పరిశ్రమల కార్యకలాపాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. ప్రొద్దుటూరులో మూలన పడిన పాలపరిశ్రమ ఆస్తుల తనఖా పెట్టిన నేపథ్యంలో సుమారు రూ.90 కోట్లు చెల్లింపులకు నోచు కోకపోవడం లేదు. జగనన్న పాలవెల్లువ వంటి పథకంలో భాగంగా పునరుద్ధరణ కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూ.12 కోట్లతో కూడిన బుగ్గవంక బ్యూటిఫికేషన్‌, లైటింగ్‌ సిస్టమ్‌ ఎప్పుడు ఏర్పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.కదలని జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2 జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2 పనులకు కదలిక ఎప్పుడు వస్తుందో తెలియ డం లేదు. ఫేజ్‌-1లో భాగమైన సర్వరాయసాగర్‌, వామి కొండ రిజర్వా యర్లు ఎప్పటికి సాకారమవుతాయో తెలియడం లేదు. ఇటీవల జిల్లా నీటి పారుదలశాఖ రూ.212 కోట్లతో కూడిన ప్రతిపాదనల అనుమతుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రూ.82 కోట్లతో కూడిన మైలవరం రిజర్వాయర్‌ ఆధునీకరణ ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు.నిరాశలోనే..నిర్వాసితులుఅన్నమయ్య, గండికోట నిర్వాసితుల కన్నీటి ధార ఆగడం లేదు. అన్నమయ్య రిజర్వాయర్‌ పునరుద్ధరణ రూ.777 కోట్లతో టెండర్లకు పరిమితమైంది. రెండేళ్ల కిందట అన్నమయ్య రిజర్వాయర్‌ గల్లంతైన ఘట నలో ఆరు గ్రామాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఐదు సెంట్లలో ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ అమలులో నిర్లక్ష్యం నెలకొంది. దీంతోపాటు గండికోట నిర్వాసితులకు అదనపు పరిహారం కింద రూ.3.25 లక్షలు ఇస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది.

➡️