ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రగతి భవన్లోని డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. డ్రైనేజీ డివిజన్ కార్యాలయంలో పదవి స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పలివెల త్రిమూర్తులుకు రావాల్సిన పింఛన్ల బకాయిల విడులదలకు 16 వేల రూపాయలు డిమాండ్ డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో వారు మంగళవారం దాడులు చేసి డైనేజీ డివిజన్ ఈఈ కొడాలి ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వామీలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/acb.jpg)