ప్రజాశక్తి – కాకినాడ
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన 2024 డైరీను శనివారం మధ్యాహ్నం కాకినాడ సుంద రయ్య భవన్ వద్ద దళిత నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, కెవిపిఎస్ నాయకులు మోర్త రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్.శ్రీనివాస్, దళిత సత్తా నాయకులు బచ్చలి కామేశ్వరరావు, సిఐటియు నాయకులు పి. వీరబాబు ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుడితి సురేష్ కుమార్, కూరాకుల సింహాచలం, నాయకులు నేరెడుమిల్లి రాజు, వి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.