ప్రజాశక్తి-విజయనగరం కోట : తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి అధినేత డాక్టర్ కె.తిరుమల ప్రసాద్ వెల్లడించారు. సోమవారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం కోరాపుట్ ధమన్జోడికి చెందిన పూల్ కుమారి దేవి (69) తీవ్రమైన కడుపు నొప్పి, దీర్ఘకాలిక వ్యాధితో భాదపడుతూ గతనెల 29న హాస్పిటల్కు వచ్చారని తెలిపారు. స్కాన్ చేసి చూడగా ఆమెకు పిత్తాశయంలో రాళ్లుతో పాటు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కోత లేకుండా లాప్రోస్కోపిక్ ద్వారా శస్త్రచికిత్స విజయవంతంగా చేసినట్లు తెలిపారు. ఆ మహిళ పిత్తాశయంలో నుంచి 100కు పైగా రాళ్లు తీశామన్నారు. ఆపరేషన్ తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నార న్నారు. ఆమెకు కొంత కాలం క్రితం క్యాన్సర్ శస్త్ర చికిత్స, కీమోథెరపీ జరిగిన క్లిష్టమైన నేపథ్యంలో కూడా తిరుమల ప్రసాద్ శస్త్ర చేసినట్లు తెలిపారు. ఇటువంటి వ్యాధులు ఎక్కువగా కొవ్వు పదార్థాలు, ఆయిల్ ఎక్కవగా వాడడం, పాస్ట్ఫుడ్ ఎక్కువ గా తినడం ద్వారా వస్తాయన్నారు. ఈసందర్భంగా ఐఎంఎ, విజయనగరం డాక్టర్లు డాక్టర్ తిరుమల ప్రసాద్ను అభినందించారు. కార్యక్రమంలో ఎఒ సిహెచ్.మహేష్, ఆస్పత్రి సెంటర్ హెడ్ పద్మకుమార్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/tirumala.jpg)