ప్రజాశక్తి-కారంచేడు(బాపట్ల) : ఇటీవల కురిసిన తుఫాను దాటికి మండలంలోని వివిధ ప్రాంతాల్లో నష్టపోయిన రైతులు జాబితా గురువారం వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మండలంలోని కొడవాలివారిపాలెం, స్వర్ణ , గ్రామాలలో మిచాంగ్ తుఫాన్కి దెబ్బతిన్న వరి, మిరప, పొగాకు పంటలను నమోదు చేసిన జాబితాను రైతుభరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఏడియే ఎన్ మోహనరావు మాట్లాడుతూ.. జాబితాలో ఉన్న రైతులు వారి పేర్లు వారి అకౌంట్ నెంబర్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఈనెల 22వ తేదిలోపు స్థానిక రైతుభరోసా సిబ్బందికి తెలియచేసి సరిచేసుకోవాలని చెప్పారు. అదేవిధముగా శనగ పంట దెబ్బతిన్న రైతులకు జేజి -11, కే ఏ కే-2 శనగ విత్తనాలు 80శాతం రాయితీ పైన పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కె సుధీరబాబు, కారంచేడు మండలం, కొడవాలివారిపాలెం సర్పంచ్ కొడాలి మోహన్ కృష్ణ ( సాగర్) , వ్యవసాయ శాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు, ప్రకాష్ విఆర్ఓ రామారావు, రెండు గ్రామముల రైతులు పాల్గొన్నారు.