జిల్లాలో మిచౌంగ్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే ఆందోళన తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం మండలంలోని కొత్తపల్లెలో నేలమట్టమైన అరటి తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుపాన్ కారణంగా అరటి తోట మొత్తం నేలమట్టం అయిందని బాధిత రైతులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలన్నారు. ఎకరానికి రూ. 2 లక్షల చొప్పున నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేవలం ఆదేశాలకే పరిమితమయ్యారే తప్ప సహాయక చర్యలు చేపట్టలేదని వాపోయారు. రెండు, మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల వల్ల రోజువారి కూలి చేసుకునే పేదలకు పూట గడవడమే కష్టంగా ఉందని అలాంటి వారికి భోజనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో ఆరా కొరగా సాగు చేసిన వరి, అరటి, ఆకుతోటలు, బొప్పాయి పంటలు పూర్తిగా చేలోనే నేలకొరిగాయని చెప్పారు. జిల్లాలో అక్కడక్కడా సాగుచేసిన మినుము, శనగ, ఉద్యాన పంటలు నేలబట్టమయ్యాయి అన్నారు. పత్తి పంట, పూల తోటలు పాడైపో యిందన్నారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నప్పటికీ ఆచరణలో ఎక్కడా లేవని వరి కోత మిషన్లు యంత్రాలన్నీ వైసిపి నేతల ఇళ్లలో ఉన్నాయని విమర్శించారు. యంత్రాల అందుబాటులో ఉంటే సగానికి పైగా పంట నూర్పిడి సకాల ంలో చేసుకునే వారన్నారు. దాన్యం కప్పు కోవడానికి, పట్టలు సరఫరా కూడా ప్రభుత్వం నిలిపేసిందని రైతులు ఆవేదన చెందు తున్నారని చెప్పారు. . తక్షణం ప్రభుత్వం దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసి పంటల బీమా, పెట్టుబడి రాయితీ, పరి హారాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం చెల్లిం చాలని, తుపాన్ సహాయక చర్యలు చేప ట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్య క్రమం లో ఎపి రైతు సంఘం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి బి. దస్తగిరిరెడ్డి, వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నరసయ్య సురేష్ తోపాటు బాధిత రైతులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/7-5.jpg)