ప్రజాశక్తి-పెద్దారవీడు: మండలంలోని దేవరాజుగట్టు కాశినాయన ఆశ్రమంలో మైలా నాగిరెడ్డి ఆర్థిక సహకారం తో పేదలకు దుప్పట్లను శ్రీశైలం ట్రస్ట్బోర్డు మెంబర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు గుంటక సుబ్బారెడ్డి, కుందరు బాలిరెడ్డి, రావి చెంచిరెడ్డి, వెన్నా వెంకటరెడ్డి, కుందురు రమణారెడ్డి, గోగిరెడ్డి నారాయణరెడ్డి, తిరుమలరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.