క్యాలెండర్ను అవిష్కరిస్తున్న ఎంఎల్ఎ మహీధర్ రెడ్డి
ప్రజాశక్తి క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి-కందుకూరుప్రజాశక్తి ప్రచురించిన నూతన సంవత్సరం (2024) క్యాలెండర్ను ఎంఎల్ఎ మానుగుంట మహీధర్ రెడ్డి ఆవిష్కరించారు. మహీధర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందుకూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తోకల కొండయ్య, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గేరా మనోహర్, కందుకూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ద్వారకా రాణి, ప్రజాశక్తి కందుకూరు విలేకరి నాదెళ్ల కోటేశ్వరరావు, ప్రజాశక్తి కందుకూరు డివిజన్ ఇన్ఛార్జి ఇ మహేశ్వరరావు, శింగరాయకొండ ప్రజాశక్తి విలేఖరి పి రవికుమార్, కందుకూరు ప్రజాశక్తి ఏజెంట్ సాధు పవన్ కుమార్ పాల్గొన్నారు.