రొద్దం : యుటిఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన పదో తరగతి మోడల్ పేపర్స్ను సోమవారం దొడఘట్ట జడ్పీ హైస్కూల్లో యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి కె.మారుతి, ఉపాధ్యాయుడు రమేష్, దాత వైటి రెడ్డిపల్లి వార్డ్ మెంబర్ నరేష్ విద్యార్థులకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి ఈ మోడల్ పేపర్లను బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి మారుతిరమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.