రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్న చల్లా శ్రీనివాసరావు
రేవంత్రెడ్డికి ‘చల్లా’ అభినందనలు
ప్రజాశక్తి-కందుకూరు : జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం మాజీ అధ్యక్షులు, టిడిపి నేత చల్లా శ్రీనివాసరావు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని టిపిసిసి అధ్యక్షులు, రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన తన అను చరులతో రేవంత్ ఇంటికి చేరుకుని పుష్ప గుచ్చం ఇచ్చి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నప్పటి నుంచి చల్లా శ్రీనివాసరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ ఎన్నికల ఫలితాలు రావడం, కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రావడంతో రేవంత్ రెడ్డిని,చల్లా శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
![రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్న చల్లా శ్రీనివాసరావు](https://prajasakti.com/wp-content/uploads/2023/12/300-challa.jpg)