రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న కంచర్ల శ్రీకాంత్
రైల్వే అధికారులకు ‘కంచర్ల’ వినతి
ప్రజాశక్తి-కందుకూరు ”అమత్ భారత్ స్టేషన్ పధకంలో భాగంగా 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోది శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా కుప్పం రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ,ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొ న్నారు. ఆయన మాట్లాడుతూ కుప్పం అభివద్ధికి రైల్వే కీలకమని తెలిపారు. కుప్పం రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని రైల్వే స్టేషన్ అభివద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం రైల్వే అధికారులు ఉన్నారు.