ప్రజాశక్తి -యద్దనపూడి(బాపట్ల) : యద్దనపూడి గ్రామ రెవెన్యూ సహాయకుడిగా పనిచేయుచున్న షేక్ మీరా సాహెబ్ వయసు (60) ఆకస్మికంగా మంగళవారం యద్దనపూడి గ్రామంలో మృతి చెందారు. ఈయన సుమారుగా 30 సంవత్సరాల నుండి గ్రామస్తులకు విఆర్ఎగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. యద్దనపూడి ఇన్చార్జి తహశీల్దారు విష్ణు ప్రసాద్ భౌతిక గాయాన్ని సందర్శించి.. నివాళులర్పించారు. మట్టి ఖర్చులకు రూ.10వేలు సాయం అందజేశారు. మృతునికి మండల అధికారులు వీఆర్వోలు, వీఆర్ఏలు, హాజరై నివాళి అర్పించారు.