సంక్షేమానికి కట్టుబడిఉన్నాం.. అసోహలు వీడండి

Mar 26,2024 23:48

ముస్లిమ్‌ పెద్దలతో మాట్లాడుతున్న డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ముస్లిమ్‌ మైనార్టీలు అసోహలు వీడాలని, వారి సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉందని టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం గుంటూరు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో మంగళవారం ముస్లిములతో ఆయన సమావేశమ య్యారు. టిడిపి హయాంలో మైనార్టీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. శాసన మండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌ను దూషించారని చెప్పారు. ‘నారా హమారా – టిడిపి హమారా’ అంటూ ముస్లిం నేతలు చంద్రబాబు నాయుడిని అక్కున చేర్చుకున్నారని చెప్పారు. దుల్హన్‌ పథకం, రంజాన్‌ తోఫా, షాది ముబారక్‌ వంటి పథకాలను రద్దు చేసిన మైనార్టీ వ్యతిరేక వైసిపి అని, ఆ పార్టీ చేసే అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు మసీదు విషయంలో ప్రశ్నించిన ముస్లిం సోదరుడు ఇబ్రహీంను హత్య చేయించారని విమర్శించారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చాక ముస్లిములకు మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. మైనార్టీలంతా అపోహలు వీడాలని, ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపికి కూటమికి అండగా నిలవాలని తన గెలుపునకు కృషి చేయాలని కోరారు.

➡️