25వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరం 25వ డివిజన్‌లో మాగుంట కుటుంబ సభ్యులు, దామచర్ల కుటుంబ సభ్యులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్ళి సూపర్‌ సిక్స్‌ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికలలో ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్‌, నియోజకవర్గ అభివృద్ధికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దామచర్ల జనార్ధనరావు విశేష కృషి చేసినట్లు తెలిపారు. సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని, అసెంబ్లీ అభ్యర్థిగా దామచర్ల జనార్ధనరావును గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరదళ్ళు సురేఖ, శశికళ, చెల్లెలు వాణి, సంధ్య, మేనకోడలు కీర్తి పాల్గొన్నారు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్ధనరావు అక్క మాధవి, కుమార్తె అనిషా లక్ష్మి, మరదలు డాక్టర్‌ హిమ బిందు, కోడలు, ఆత్మకూరి బ్రహ్మయ్య, సాయి రామ్‌, తెలుగుదేశం, జనసేన, బిజెపి మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️