లక్ష 7 వేల ఓటరు దరఖాస్తుల స్వీకరణ

Dec 12,2023 16:38 #Kakinada
  • ఈఆర్వో నాగ నరసింహారావు వెల్లడి
  • రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

ప్రజాశక్తి-కాకినాడ : ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ -2024 భాగంగా ఇప్పటివరకు ఫారం 6,7,8 ద్వారా 1,07,063 దరఖాస్తులు వచ్చాయని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో, నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు చెప్పారు. వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం పై మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఫారం 6,7,8 ద్వారా వచ్చిన దరఖాస్తుల ప్రగతిని ఈఆర్వో నాగ నరసింహారావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 83,276 పరిష్కరించామన్నారు. 9790 దరఖాస్తులను వివిధ కారణాల వల్ల తిరస్కరించామని చెప్పారు. వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఓటరు ప్రత్యేక శిబిరంలో వచ్చిన దరఖాస్తులను కూడా ఎప్పటికప్పుడు వేగంగా పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యధికంగా లక్ష కు పైగా దరఖాస్తుల స్వీకరణతో పాటు పరిష్కారంలో కూడా కాకినాడ జిల్లా పరిధిలో కాకినాడ సిటీ నియోజకవర్గం మెరుగైన స్థానంలో ఉందన్నారు. కేవలం 12 శాతం దరఖాస్తులు మాత్రమే పరిష్కరించాల్సి ఉందన్నారు. కొత్త ఓటర్ల నమోదు, నాన్ ట్రేస్డ్ ఓటర్లకు సంబంధించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించిన నోటీసుల వివరాలు, మార్పులు చేర్పులకు సంబంధించిన సమాచారాన్ని ఆయన నాయకులకు వివరించారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు( వైయస్సార్సీపి ), తుమ్మల రమేష్, గదుల సాయిబాబా (టిడిపి ) అప్పారావు (బీఎస్పీ), రాంబాబు ( అమ్ ఆద్మీ పార్టీ), ఏఈఆర్వో లు , సీతాపతి రావు, మురళీకృష్ణ, హరిదాసు, నాగశాస్త్రులు, జాన్ బాబు వరహాలయ్య, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

➡️