ప్రజాశక్తి డుంబ్రిగుడ:- సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని గిరిజనులు ఘనంగా పండగ వేడుకలు జరుపుకుంటున్నారు ఈ పండగ సందర్భంగా మండలంలోని కించమండ వారపు సంతలో గిరిజన సంప్రదాయమైన షేర్ బుడియాను సోబోరి నృత్యం చేస్తూ వారపు సంతలో గిరి యువత విచిత్ర వేషధారణతో సందడి చేశారు. వారపు సంతల్లోని ప్రతి దుకాణం వద్ద సోబొరి నృత్యం చేస్తూ చందాలను వసూలు చేశారు.
![షేర్ బుడియా వసూలు చేస్తున్న యువలకులు](https://prajasakti.com/wp-content/uploads/2024/01/sank-3.jpg)