సిపిఎం గెలిస్తేనే మనుగడ

సున్నం మట్కా గ్రామంలో సీపిఎం సమావేశం
ప్రజాశక్తి – విఅర్ పురం : వచ్చే ఎన్నికల్లో సిపిఎం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు మనుగడ ఉంటుందని, అందరూ సిపిఎం అభ్యర్థులను విజయానికి కృషి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం వలస ఆదివాసి గ్రామమైన సున్నం మట్కా గ్రామంలో సిపిఎం నాయకులు పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 1/70 చట్టము 3 జీవో ఉంటేనే ఆదివాసి ప్రాంతాల్లో గిరిజనులకు విద్యా, ఉపాధి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. పిల్లల చదువులకు 3 జీవో ముఖ్యమైనదని అన్నారు. చట్టసభల్లో సిపిఎం అభ్యర్థులు ఉంటే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ సమస్యలపై పోరాడి రావలసిన హక్కులు కాపాడతాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, ఆదివాసి గిరిజనులు, పాల్గొన్నారు.

➡️