రామవరంలో పెన్షన్ల పంపిణీ

ప్రజాశక్తి-విఆర్ పురం : మండలంలోని రామవరం పంచాయతీలో గల రామవరంలో సోమవారం రోజు ఎంపీపీ కాలం లక్ష్మీ, స్థానిక సర్పంచ్ కారం, బుచ్చమ్మ, సెక్రటరీ తాతారావు, సిపిఎం నాయకులు చేతుల మీదుగా అయ్యావాలకు పెన్షన్ అందించడం జరిగింది. లభ్యదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇంటికి తెచ్చి ఇచ్చేవారని ఇప్పుడు సచివాలయానికి రావాలంటే కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు దూరం అవటంతో నడవలేక ఉన్నామని నాన్న ఇబ్బందులు పడుతూ సచివాలయానికి చేరుకున్నామని ఈ ప్రభుత్వం ఇంటింటికి తెచ్చే విధంగా చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఎంపీపీ మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగానే ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని గ్రామాల్లో చాలామంది అనారోగ్యంతో ఉన్నారని లేవలేని స్థితిలో ఉన్నారని వారు సచివాలయానికి ఎలా వస్తారని ఆమె అన్నారు. తక్షణమే అలాంటివారికి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

➡️