వైసిపిలో పలువురు చేరిక

May 12,2024 00:07
న్నికల నేపథ్యంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు వైసిపిలో చేరారు. మండలంలోని కాశీపట్నం పంచాయతీ తట్టవలస గ్రామనికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసిపిలో చేరినట్లు

ప్రజాశక్తి -అనంతగిరి:ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు వైసిపిలో చేరారు. మండలంలోని కాశీపట్నం పంచాయతీ తట్టవలస గ్రామనికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసిపిలో చేరినట్లు మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ మదీనా తెలిపారు. జగనన్న చేసే సంక్షేమ పథకాలతో వైసిపికి ప్రజలు మద్దతు పలుకుతున్నారని మదీనా తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే మరిన్ని అభివృద్ధి పథకాలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు కన్నమ్మ, సత్యవతి పాల్గొన్నారు.

➡️