వైద్యం పొందుతూ వ్యక్తి మృతి

Person dies while receiving treatment

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మేడ మేట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి వైద్యం పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఓకర్తి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. జడ్డంగి ఎస్ఐ రఘునాథరావు తెలిపిన వివరాలు ప్రకారం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట గ్రామానికి చెందిన బేలెం రమేష్ (25) అనే వ్యక్తి మండలంలోని వాతంగి గ్రామంలో జరిగే పెళ్లి నిమిత్తం స్నేహితులతో వచ్చి పెళ్లి అనంతరం నిద్రించడానికి డాబా పైకి వెళ్లే ప్రయత్నంలో కాలుజారి కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. వైద్యం నిమిత్తం మంగళవారం బంధువులు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ నేపథ్యంలో మృతుని భార్య వంతు జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జడ్డంగి ఎస్ఐ రఘునాథరావు తెలిపారు.

➡️