తమ్మయ్యపేటలో రోడ్డు నిర్మాణం

ప్రజాశక్తి-వి.ఆర్.పురం:  మండలంలోని పెద్దమట్టపల్లి పంచాయతీలు గల తమ్మాయిపేట గ్రామంలో 9 లక్షలతో సిసి రోడ్డు శాంక్షన్ అవటంతో పనులు ప్రారంభించారు. సిసి రోడ్డు పనులను సోమవారం రోజున సర్పంచ్ వెట్టి లక్ష్మి తోపాటు సిపిఎం బృందం పరిశీలించారు.ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తొమ్మిది లక్షలతో సిసి రోడ్డు శాంక్షన్ చేపించామని మూడు అడుగుల వెడల్పుతో వంద మీటర్లు పొడుగునా ఈ రోడ్డు వేయటం జరుగుతుందని కాంట్రాక్టర్స్ నాణ్యత లోపం లేకుండా చూడాలని ఎలాంటి అవినీతికి పాల్పడవద్దని రోడ్డు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి తాపీ మేస్త్రీలకు కూలీలకు సూచించారు మండలం నుండి ఈ గ్రామానికి వ్యవసాయదారులు ప్రజలు నిత్యం తిరుగుతుంటారని ఈ రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. గతంలో ఈ రోడ్డు గోతులతో వాహనాలు తిరిగే పరిస్థితి లేదని రైతుల ప్రజలు బాధలు అర్థం చేసుకున్న సర్పంచ్ అధికారులతో మాట్లాడి ఈరోజు సిసి రోడ్డుని శాంక్షన్ చేపించామని రైతులు గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని ఆమె అన్నారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఈ ప్రభుత్వం అయినా మండలంలో అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం  సత్యనారాయణ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️