ప్రజాశక్తి-ముంచంగిపుట్టు: సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో అడుగడుగునా పోలీస్ బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మండలంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సమీపంలో తాత్కాలిక చెక్ గేట్ వద్ద ఆదివారం జి.మాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ వాహనాలను తనిఖీలు చేపట్టారు. వాహనదారుల రాకపోకలపై ఆరా తీశారు.ఈ తనిఖీల్లో స్థానిక ఎస్సై రవీంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
![తనిఖీలు చేస్తున్న పోలీసులు](https://prajasakti.com/wp-content/uploads/2024/05/police-1.jpg)