సమ్మెకు మద్దతుగా సిపిఎం, ప్రజా సంఘాలు రాస్తారోకో

ప్రజాశక్తి-విఆర్ పురం : విఆర్ పురం మండలంలోని రేకపల్లి జంక్షన్ వద్ద అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పార్స్ కు మద్దతుగా సిపిఎం, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. విజయవాడలో జరుగుతున్న ధర్నాకు మద్దతుగా నిర్వహించడం జరిగింది పలురు నాయకులు మాట్లాడుతూ. విజయవాడలో జరుగుతున్న ధర్నాలో అరెస్టులు చేయడం దుర్మార్గం అని జగన్ మొండి వైఖరి విరినాడాలని తక్షణమే అరెస్టు చేసిన వంటి వాళ్ళని విడుదల చేయాలని న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకులో పాల్గొన్నవారు వి ఆర్ పురం మండల ఎంపీపీ కారం లక్ష్మి సిఐటియు నాయకులు జిల్లా సహాయ కార్యదర్శి పూనం సత్యనారాయణ జిల్లా సభ్యులు సున్నం రంగమ్మ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, వల్ల కృష్ణారెడ్డి, ముసురు సత్యనారాయణ, రంగనాయకులు మండల కార్యదర్శి వడ్లది రమేష్, ప్రజానాట్యమండలి సిహెచ్ సుబ్బారావు, అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

➡️