ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండల పరషత్ కార్యాలయములో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాలిక పై శుక్రవారం మండల స్థాయి శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కలగ లక్ష్మీ మాటలుడుతూ గ్రామ పంచాయతీ సభలో ఆన్ని శాఖలు ఆధికారులు గ్రామ పనులు గురించి చర్చించి వాటికి పరిష్కారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉగ్గినిపాలెం సర్పంచ్ కలగ గున్నయ్యు నాయడు, మండల ప్రత్యేక అధికారి రోజా రాణి, ఎంపిడిఓ రవి కుమార్, పెంటకోట శ్రీనివాసరావు, మండల సిబ్బంది పాల్గొన్నారు.
![gpdp programm in kasimkota](https://prajasakti.com/wp-content/uploads/2024/01/gpdp-programm-in-kasimkota.jpg)