పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రారంభం

May 6,2024 23:33
ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు

ప్రజాశక్తి-నక్కపల్లి:ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును సోమవారం వినియోగించుకున్నారు. ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు కార్యాలయాల వద్ద హెల్ప్‌ డెస్క్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు బారులు తీరారు. ఓటింగ్‌ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.అనకాపల్లిడెస్క్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటింగ్‌ పెసిలిటేషన్‌ సెంటర్‌ (పివిసి)ను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌ కేంద్రంలో నర్సీపట్నం అసెంబ్లీకి సంబంధించి 2329 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️