ప్రజాశక్తి – కశింకోట : మండలంలో పాత కన్నూరు పాలెం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి మహోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. పలు గ్రామాలు ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కర్రి అప్పారావు, కన్నూరి అప్పల నాయడు, ఉత్సగ కమిటీ శ్రీ ముత్యమాంబ కమిటి, యువకులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/Sri-Muthyalamma-Festival.jpg)