కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులతో కలెక్టర్ వినోద్కుమార్
ప్రజాశక్తి-అనంతపురం
ఆర్మీ కల్నల్ మనోజ్కుమార్నాయర్ ఆధ్వర్యంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ చేపట్టిన కార్గిల్ విజరుదివస్ అవగాహన ర్యాలీ సోమవారం అనంతపురం చేరుకుంది. ఇందులో భాగంగా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పి.తిమ్మప్ప ఆధ్వర్యంలో అనంతపురంలోని పిటిసిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ వినోద్కుమార్ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు కెప్టెన్ పట్నం ఉమామహేశ్వరరావు, సార్జెంట్ సంజీవకుమార్, సుబేదార్ మహమ్మద్ ఇర్షాద్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ టి.కె.కృష్ణను ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు ఆర్ఎస్ నాగరాజ్, తిమ్మారెడ్డి, పెంచలయ్య, వై.ప్రసాద్, గొల్ల ఈశ్వరయ్య, బిఎ.హుస్సేన్, అల్లాబక్షు, సాయికుమార్, సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది గిరీష్, బాబా ఫక్రుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.